- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి సమర్పించారు. ఇంకా నాలుగు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. తన రాజీనామా విషయమై సీఎం కార్యదర్శికి కూడా ముందస్తు సమాచారం పంపారు.
- Advertisement -



