- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నటి ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించగా, సోమవారం విచారణ జరగనుంది. గత ఏడాది డిసెంబర్లో న్యాయవాది సమర్థ్ సింగ్ను వివాహం చేసుకున్న ట్విషా, మే 12న భోపాల్లో అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వరకట్న వేధింపులు, మానసిక హింస కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి 7 రోజుల రిమాండ్కు పంపారు. కేసుపై SIT దర్యాప్తు కొనసాగుతుండగా, రెండో పోస్ట్మార్టం కోసం ఎయిమ్స్ వైద్య బృందం భోపాల్కు చేరుకోనుంది.
- Advertisement -



