- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీ ఇసుక బుకింగ్ డిజిటల్ గైడ్ మన ఇసుక వాహనం ప్రక్రియ పై సోమవారం మండల కేంద్రంలో తహసిల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు, సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ బుకింగ్, ఇతర సేవలపై తహసిల్దార్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగ మోహన్, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ ఐ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



