రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో, హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ”షష్టి పూర్తి’ టైటిల్తో కథ నా వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. వయసుకు తగ్గ పాత్రలు నాకు ఒక్కడికే వస్తున్నాయా? అని ఆశ్చర్యం వేసింది. నేను నిజ జీవితంలో షష్టి పూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించాను. కానీ ఇలా సినిమా రూపంలో ‘షష్టి పూర్తి’ జరిగింది. అది నటుడిగా నా అదష్టం. పెళ్లి సమయంలో నా పాటే.. చావు సమయంలో నా పాటే.. ఇక షష్టి పూర్తి టైంలో పాట లేదండి అని కొందరు అనేవాళ్లు. ఇప్పుడు ఆ ‘షష్టి పూర్తి’ పాట కూడా వచ్చింది. మళ్లీ ఆ పాటను ఇళయరాజా చేయడం మరో అదష్టం. తెలుగు సంస్కతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా చిత్రం ఉంటుంది. తల్లిదండ్రుల పెళ్లిని బిడ్డలు చూడలేరు.. అలా బిడ్డలు చూడగలిగే తల్లిదండ్రుల పెళ్లే మా ఈ ‘షష్టి పూర్తి’. అలాగే ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. మా హీరో, నిర్మాత రూపేశ్ ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆకాంక్ష చక్కగా నటించారు. ఇది మన తెలుగు వారందరి సినిమా. మే 30న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
పిల్లలు చూడగలిగే తల్లిదండ్రుల పెళ్ళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES