- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రం బల్మూరుకు చెందిన మేడమోని కృష్ణవేణి (36)అనారోగ్య కారణంగా బుధవారం మృతి చెందారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భర్త రాములును కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై అనతి కాలంలోనే రెండు రోజుల వ్యవధిలోనే మరణించడం పట్ల గ్రామస్తులు చుట్టుపక్కల వారు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అనారోగ్యానికి గురై బుధవారం తెల్లవారుజామున మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు వెంకటరెడ్డి స్థానిక నాయకులు వెంకటయ్య కాశన్న యాదవ్ ఉన్నారు.
- Advertisement -



