Monday, June 16, 2025
E-PAPER
Homeబీజినెస్యూరోపియన్‌ వాణిజ్య కమిషనర్‌తో మంత్రి పియూష్‌ భేటీ

యూరోపియన్‌ వాణిజ్య కమిషనర్‌తో మంత్రి పియూష్‌ భేటీ

- Advertisement -

న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం యూరోపియన్‌ యూనియన్‌ వాణిజ్య కమిషనర్‌ మారోస్‌ సెఫ్కోవిక్‌తో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు. బ్రస్సెల్స్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరు ప్రాంతాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చించారు. ఒక్క నెలలోనే రెండు సార్లు భేటీ సమావేశం కావడం విశేషం. పియూష్‌ గోయల్‌ ఈ నెల 23న వాషింగ్టన్‌ నుంచి బ్రస్సెల్స్‌కు వెళ్లారు. పియూష్‌ గోయల్‌కు స్వాగతం పలుకుతున్నామని సెఫ్కోవిక్‌ పేర్కొన్నారు. వాణిజ్యంలో తాము పురోగతి సాధిస్తూనే ఉన్నామన్నారు. భారత్‌, ఈయూ ఉమ్మడి శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని.. ఇదే వేగం కొనసాగుతుందని ఆశిస్తున్నామని పియుష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -