అభివృద్ధి చేసి చూపిస్తాం
సంగారెడ్డి మున్సిపల్ 16వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి సామల మురళి ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా గొంతుకలను గెలిపించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థి సామల మురళిని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్లోని 16వ వార్డులో పోటీ చేస్తున్న సామల మురళిని గెలిపించాలని బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి మున్సిపల్లో అభివృద్ధి కావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా సీపీఐ(ఎం) అభ్యర్థులు మున్సిపాలిటీలో ఉండాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు సంగారెడ్డి మున్సిపాలిటీని పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజా గొంతుకల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. 23 సంవత్సరాల క్రితం పేదలను సమీకరించి ఇంటి స్థలం లేని పేదలకు ఇండ్ల స్థలాలు పంచిన పార్టీ అని అన్నారు. అనేక పోరాటాల ద్వారా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేసిన పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే అని తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే కాలనీలను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అభ్యర్థి సామల మురళి మాట్లాడుతూ.. ప్రజలందరినీ కలుపుకొని పని చేస్తానని, అందరూ తన గెలుపునకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మల్లేశం, నర్సింలు, మాణిక్యం, సంగారెడ్డి ఏరియా కార్యదర్శి ఎం. యాదగిరి, నాయకులు అశోక్, హనుమంతు, బాలరాజు శివ, మణి, మరియమ్మ, మణి, సుశీల, రమేష్ గౌడ్, దత్తు, రాజు, రమేష్, అలీ భాయ్, శీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా గొంతుక సీపీఐ(ఎం)ను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



