- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రాంరెడ్డి కాంప్లెక్స్ తీసుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి పార్థివదేహాన్నీ గురువారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి తోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాంరెడ్డి గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. ఆయన అకాల మరణానికి మేము ఎంతో చింతిస్తున్నామని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
- Advertisement -



