- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 69కి చేరింది. ఈ ఘటనలో దాదాపు మరో 170 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడికి అఫ్గానిస్థానే కారణమని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాకుతో ఆ దేశంపై దాడి చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాడికి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ గాని, ఏ వ్యక్తి గాని ప్రకటించలేదు.
- Advertisement -



