- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
బిచ్కుందలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నాలుగో వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రెవార్ సునీత సాయిరాం గెలుపు కోసం మద్నూర్ మండల కేంద్ర సర్పంచ్ ఉష కుటుంబ సభ్యులు సంతోష్ మేస్త్రి, పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ మహేష్ తదితరులు కలిసి ఇంటింటా ముమ్మర ప్రచారం చేశారు. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



