– 9వ వార్డు అభ్యర్థి ఊరుదొండ వనిత
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వర్డ్ అభ్యర్థి ఊరుదొండ వనిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె తన వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రజలకు ఏ సమస్య అయినా తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని ఓటర్లకు భరోసా ఇస్తూ ఆమె ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ కుటుంబం ఇప్పటినుండి కాదని కొన్ని సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తున్న కుటుంబం అని దీనిని గమనించి ప్రజలు తనను ఆశీర్వదించి ఓట్లు వేయాలన్నారు. అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థిగా నిధులు తెచ్చేందుకు కృషిచేసి నిధులను తీసుకువచ్చి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.
ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



