Sunday, February 8, 2026
E-PAPER
Homeఖమ్మంఒకటో వార్డు సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం

ఒకటో వార్డు సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం

- Advertisement -

1 వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  అభ్యర్థి గౌని రాజా రమేష్ యాదవ్
నవతెలంగాణ-హలియా
 
హాలియా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో భాగంగా, ఒకటో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌని రాజా రమేష్ యాదవ్ ఆదివారం తన వార్డులో ఎన్నికల ప్రచార పర్యటన చేపట్టారు. ‘హస్తం’ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన, వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.పదవి వచ్చాక కనిపించకుండా పోయే వ్యక్తిని కాదని, ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.వార్డులో ఉన్న డ్రైనేజీ, తాగునీరు మరియు రోడ్ల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీరుస్తానని వివరించారు.వార్డులో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గెలిచిన వెంటనే వార్డు అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని, పోలీసు నిఘా పెంచి ప్రజలకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చారు.సాధారణ ప్రచారానికి భిన్నంగా రమేష్ యాదవ్ తనదైన ముద్ర వేస్తున్నారు. నేను మీ వార్డు బిడ్డను.. మీ సమస్య ఏదైనా సరే అర్ధరాత్రి పిలిచినా పలికే సేవకుడిగా ఉంటాను” అని భావోద్వేగంతో ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా రమేష్ యాదవ్‌కు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన వెన్నంటి నడిచారు. “హస్తం గుర్తుకే మన ఓటు – అభివృద్ధికి వేయండి బాట” అంటూ సాగిన ఈ ప్రచార పర్వం వార్డులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.​”మార్పు మన వార్డు నుండే మొదలవ్వాలి. అభివృద్ధి వైపు అడుగు వేద్దాం. నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తే, ఒకటో వార్డును మున్సిపాలిటీలోనే నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతాను.”అన్నారు. రాజా రమేష్ గెలుపు కోసం స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు రాజా రమేష్ ను గెలిపించి పట్టం కట్టాలని మీ సమస్యలన్నింటికీ ఆయన పరిష్కారం చూపిస్తారని ఆయనకు మా యొక్క ఆశీర్వాదము మద్దతు ఎప్పుడు ఉంటుందని ప్రజలను అభ్యర్థించారు. రాజా రమేష్ కూడా తనకు తమ అమూల్యమైన ఓటు హక్కును హస్తాం గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -