నవతెలంగాణ-హైదరాబాద్: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బీర్లా తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహాం ఉన్నాయి. ఈక్రమంలోనే ఆయనపై ఆవిశ్వాస తీర్మానానికి సన్నాహాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు అందజేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో పాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు కోరానున్నాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, అలాగే యూఎస్ ట్రేడ్ డీల్ పై, 2020లో చైనా-భారత్ లకు మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణలపై మాజీ ఆర్మీ జనరల్ నవవాణే రాసిన బుక్పై సభలో చర్చ జరగాలని ఎంపీలు డిమాండ్ చేయగా.. 8 మంది ఎంపీలపై వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి.
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం..లోక్సభ సెక్రటరీ జనరల్కి నోటీసులు
- Advertisement -
- Advertisement -



