నవతెలంగాణ – అశ్వారావుపేట
మనకు ఇష్టమైన వాళ్ళను ఎన్నుకోవడం,నచ్చని వారిని వద్దనుకోవడం గెలుపు ఓటములు.ఎవ్వరూ పాలనకు పనికిరారు అని చెప్పడమే నోటాకు ఓట్లు వేయడం. ఇది ప్రజాస్వామ్యం లో గొప్ప అంశం. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో నోటాకు 42 ఓట్లు వచ్చాయి. 22 వార్డుల్లో 17 వార్డుల్లో మొత్తం 42 మంది నోటా కు ఓటేసారు.5 వార్డుల్లో మాత్రమే నోటా కు ఓట్లు పడలేదు. 8,11,14 ఈ వార్డులో ఒక్కొక్కరు చొప్పున నోటా కు ఓట్లు వేసారు.
1,5,6,12,17,18,19,20 వార్డులో ఇద్దరేసి చొప్పున నోటాకు ఓట్లు నొక్కారు. 4,16 వార్డుల్లో ముగ్గురే సి చొప్పున నోటా ఒకే చెప్పారు. 9,15,21 వార్డుల్లో నలుగురే సి చొప్పున నోటా కు ఓట్లు వేసారు. 22 వ వార్డులో ఐదుగురు ఓటర్ లు నోటాకు ఓట్లు నొక్కారు. 2,3,7,10,13 వార్డుల్లో మాత్రమే నోటా కు ఓట్లు పడలేదు.



