నవతెలంగాణ – జన్నారం
గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ అన్నారు. శనివారం గల్ఫ్ కార్మికులు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల వీసా సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం, మరణించిన కార్మికుల పార్థివ దేహాలను స్వదేశానికి పంపించే ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అందించే ఇన్సూరెన్స్ డబ్బులు కాలయాపన వంటి అంశాలపై ప్రభుత్వాలు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు.
భారతీయ ఎంబసీ, ఒమాన్ పోలీస్ శాఖ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పాలాజీ శ్రీనివాస్ కోఆర్డినేటర్లకు ఒమాన్ లేబర్ law వివిధ సమస్యల అవగాహన కల్పించి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యను పరిష్కరించలేక నేను కృషి చేస్తారని వారు హామీ ఇచ్చారు.
TGWWC ఇచ్చిన బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వహిస్తూ, గల్ఫ్ కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. సమావేశాన్ని విజయవంతం చేసిన మస్కట్ కోఆర్డినేటర్లు, సభ్యులు మరియు స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TGWWC- ఓమన్ శాఖ అధ్యక్షులు జవుడల సత్తన్న మస్కట్ శాఖ కోఆర్డినేటర్లు గోగు దేవరాజు, నగునూరు రాజు, పొన్నం శ్రీనివాస్ కోఆర్డినేటర్లు కార్మికులు పాల్గొన్నారు.



