Monday, February 16, 2026
E-PAPER
Homeఆటలునేపాల్‌ ఇంటిబాట!

నేపాల్‌ ఇంటిబాట!

- Advertisement -

వెస్టిండీస్‌ చేతిలో భారీ ఓటమి

ముంబయి : తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను వణికించి అందరి దృష్టిని ఆకర్షించిన నేపాల్‌.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నుంచి అందరి కంటే ముందుగానే నిష్క్రమించింది. గ్రూప్‌-సిలో ఆదివారం వాంఖడెలో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్‌ దశలో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన నేపాల్‌.. మరో మ్యాచ్‌ ఉండగానే సూపర్‌ఎయిట్‌ రేసు నుంచి తప్పుకుంది. తొలుత నేపాల్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్‌ (58, 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సోంపాల్‌ (26 నాటౌట్‌) రాణించారు. విండీస్‌ పేసర్‌ జేసన్‌ హోల్డర్‌ (4/27) నాలుగు వికెట్లు తీసుకున్నాడు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 15.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి ఊదేసింది. షారు హోప్‌ (61, 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (46 నాటౌట్‌, 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రాండన్‌ కింగ్‌ (22) రాణించారు.

యుఎస్‌ఏ గెలుపు
గ్రూప్‌-ఏలో యుఎస్‌ఏ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. నమీబియాతో మ్యాచ్‌లో తొలుత 199/4 పరుగులు చేసిన యుఎస్‌ఏ.. ప్రత్యర్థిని 20 ఓవర్లలో 168/6 పరుగులకే కట్టడి చేసింది. 31 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది. యుఎస్‌ఏ బ్యాటర్లు మోనాంక్‌ పటేల్‌ (52), సంజయ్ కృష్ణమూర్తి (68 నాటౌట్‌) అర్థ సెంచరీలు సాధించారు. గ్రూప్‌ దశలో 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించినా.. యుఎస్‌ఏకు సూపర్‌ఎయిట్‌ అవకాశాలు దాదాపుగా లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -