Monday, February 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'హంగ్‌'పై ప్రత్యేక దృష్టి సారించండి

‘హంగ్‌’పై ప్రత్యేక దృష్టి సారించండి

- Advertisement -

ఏ ఒక్కటీ చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
పార్టీ నేతలు, మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉన్న చోట మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక సజావుగా జరిగిలా అన్ని జాగ్రత్తలు తీసువాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ సమయంలో ‘హంగ్‌’ వచ్చిన చోట కూడా ప్రత్యేక దృష్ట్టించాలని కోరారు. అందులో ఏ ఒక్కటీ చేజారిపోకుండా చూడాలని మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -