- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలోని సెంట్ మేరీ హై స్కూల్, చైతన్య భారతి, కస్తూర్బా గాంధీ పదవ తరగతి పాఠశాల విద్యార్థుల రికార్డులను మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుల బృందం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులు రికార్డులను తప్పులు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రికార్డులు సక్రమంగా ఉంటేనే మార్కులు వస్తాయని ప్రతి విద్యార్థి కూడా గమనించాలని సూచించారు. రికార్డులు తప్పు లేకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సరస్వతి , ప్రధానోపాధ్యాయులు సుధాకర్, వెంకటయ్య, శ్రీశైలం, పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్, ధనంజయ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు.
- Advertisement -



