- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను సోమవారం రైల్వేశాఖ ఆమోదించింది. జులై 20 నుంచి ఆయన విధులకు దూరంగా ఉండననున్నారు. ఈ మేరకు తాజాగా స్టాక్ ఎక్సేంజీకి ఐఆర్సీటీసీ సమాచారం ఇచ్చింది.
- Advertisement -



