Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బైక్ ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి 

బైక్ ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
బైక్‌ ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని గంట్లకుంట శివారులో జరిగింది. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంట్లకుంట కు చెందిన గుర్రం సంతోష్(28) గ్రామంలో గతకొంతకాలంగా ఆర్ఎంపీ గా వైద్య సేవలు అందిస్తున్నాడు. రాత్రి ఏదో ఆలయానికి వెళ్లి ఇంటికి తన బైక్ పై తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -