Monday, June 29, 2026
E-PAPER
Homeబీజినెస్'జిసిపిఆర్ఎస్ 2026' కు సన్నద్ధమవుతున్న భారత ప్లాస్టిక్రీసైక్లింగ్ పరిశ్రమ

‘జిసిపిఆర్ఎస్ 2026’ కు సన్నద్ధమవుతున్న భారత ప్లాస్టిక్రీసైక్లింగ్ పరిశ్రమ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుతం రూ.30,000 కోట్లుగా ఉన్న భారత ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ విలువ 2035 నాటికి రూ.60,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో, 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ఆల్-ఇండియా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ (ఏఐపీఎంఏ) ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 5, 2026 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ ప్రతిష్టాత్మక నాలుగు రోజుల ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ జరగనుంది. కేంద్ర రసాయనాలు & ఎరువులు, పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల శాఖ, వాణిజ్య-పరిశ్రమలు, గృహ నిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు మరియు నీతి ఆయోగ్ మద్దతు, మార్గదర్శకత్వంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జీసీ చైర్మన్ శ్రీ అరవింద్ మెహతా, ఏఐపీఎంఏ ప్రెసిడెంట్ శ్రీ సునీల్ షా దార్శనికతతో, విధానపరమైన మార్పులు, పరిశ్రమల సహకారం ద్వారా బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణను, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా గుర్తింపు పొందిన ఈ ‘జిసిపిఆర్ఎస్ 2026’లో 12 దేశాల నుంచి 200 కు పైగా సంస్థలు పాల్గొంటున్నాయి. 12,000 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో జరిగే ఈ ప్రదర్శన.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌కు సంబంధించిన వినూత్న పరిష్కారాలకు, అత్యాధునిక సాంకేతికతలకు ఒకే వేదికగా నిలవనుంది.

ఆటోమేటెడ్ వేస్ట్ సార్టింగ్ యంత్రాలు, అధునాతన మెకానికల్ మరియు కెమికల్ రీసైక్లింగ్ పరికరాలు, వ్యర్థాల నుంచి ఇంధనం/విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికతలు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక ‘కన్సల్టెంట్స్ క్లినిక్’, ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఇపిఆర్) నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ‘ఎన్విరాన్‌మెంట్ డెస్క్’ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో సాంకేతికత ఆధారిత రీసైక్లింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ‘జీరో వేస్ట్ ఈవెంట్’గా తీర్చిదిద్దారు. రీసైక్లింగ్ ఎకోసిస్టమ్‌లో వినూత్న స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రత్యేక సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్, జాతీయ-అంతర్జాతీయ నిపుణులతో రెండు రోజుల సస్టైనబిలిటీ ఫోరమ్, మరియు పరిశ్రమల నాయకులతో ప్రత్యేక సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశం ఇందులో కీలకాంశాలు. దేశానికి అవసరమైన దాదాపు 3 మిలియన్ టన్నుల నాణ్యమైన రీసైకిల్స్ భవిష్యత్ కార్యాచరణపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశించిన ‘స్వచ్ఛ భారత్’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనకు పరిశ్రమల నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగంలో ఉద్భవిస్తున్న కొత్త సాంకేతికతలు, వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి పారిశ్రామికవేత్తలు, రీసైక్లర్లు, బ్రాండ్ యజమానులు, పెట్టుబడిదారులు మరియు సంబంధిత భాగస్వాములందరూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -