- Advertisement -
యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఫులెర్టన్ (యుఎస్ఏ) : మాజీ వరల్డ్ నం.1, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ యుఎస్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. భారతకాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్పై 21-15, 16-21, 21-9తో చైనీస్ తైపీ షట్లర్ యాంగ్ గెలుపొందాడు. 69 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో కిదాంబి శ్రీకాంత్ రెండో గేమ్లో నెగ్గి పోటీ ఇచ్చినా.. నిర్ణయాత్మక గేమ్లో నిరాశపరిచాడు. ఇటీవల వరుస టోర్నీల్లో నిరాశపరుస్తున్న కిదాంబి శ్రీకాంత్.. యుఎస్ ఓపెన్లో టైటిల్ విజయానికి చేరువైనా, రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.
- Advertisement -



