ప్రైమ్ ఇమేజింగ్ స్కాన్ సెంటర్ సీనియర్ రేడియాలజిస్టు డా॥ కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ-కంఠేశ్వర్
రోగ నిర్ధారణలో రేడియాలజీ అత్యంత కీలకమని ప్రైమ్ ఇమేజ్ స్కాన్ సెంటర్ సీనియర్ రేడియాలజిస్టు డా॥ కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా రేడియాలజీ విభాగంలో నిజామాబాద్ లో ప్రైమ్ ఇమేజ్ స్కాన్ సెంటర్ సేవలందిస్తున్నట్లు తెలిపారు.
అత్యాధునిక వైద్య పరీక్ష పరికరాలతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేరువైనట్లు పేర్కొన్నారు. రేడియాలజీ విభాగంలో రోగ నిర్ధారణ అత్యంత సూక్ష్మంగా గుర్తించే స్కానింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. మారుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ప్రైమ్ ఇమేజింగ్ స్కాన్ సెంటర్ ముందుంటుందన్నారు. ముఖ్యంగా రోగ నిర్ధారణ, ఫెర్టిలిటీ సమస్యకు రేడియాలజీ అత్యంత కీలకమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిరంతరం మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం 929999.3899 నెంబర్ కు సంప్రదించండి.



