Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవరంగల్‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

వరంగల్‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ-నయీంనగర్‌
వరంగల్‌ జిల్లా కోర్టుకు గురువారం బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కోర్టు ప్రాంగణం మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని, మూలమూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సుబేదారి సీఐ రంజిత్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌ ఫ్యామిలీ కోర్టుకు ఉదయం 10:20 ప్రాంతంలో బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో తనిఖీలు చేశామని ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదన్నారు. గతంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -