నవతెలంగాణ – కుభీర్
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను మండల కేంద్రమైన కుభీర్ తో పాటు పార్డి(బి) లోని ఎల్ బి ఎం పాఠశాల డోడర్నా ఆశ్రమ గిరిజన పాఠశాలలో పల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్తూర్బా గాంధీ విద్యాలయం లో శనివారం సైన్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలో ఆయా గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సివి రామన్ చిత్ర పటానికి పూజలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు క్యూజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు భౌమతులను ప్రధానం చేశారు. సైన్స్ డే సందర్భంగా పలు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులకు విద్యార్థులు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.



