నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెం గ్రామంలోని అంగన్వాడీ వన్ సెంటర్లో శనివారం ఈసీసీ డే సందర్భంగా బుర్రకథ కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సిహెచ్ దీప మాట్లాడుతూ ఈ సి సి ఈ డే సందర్భంగా ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలు తల్లిదండ్రులతో చేయించడమైనది అన్నారు. అదేవిధంగా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు ప్రదర్శించడం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన కళాకారుడు తండ ముత్తయ్య బుర్రకథ ఒగ్గు కథ గొల్ల కథ డోలు తబలా వాయిద్యాల మధ్య కళ లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు స్వప్న పద్మ జోష్ణ దీపిక తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి సెంటర్లో బుర్రకథ కళా ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



