- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ బాధిర పాఠశాలలోని చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ స్టేషనరీ వస్తువులు ఆదివారం ఉచితంగా అందజేసినారు. గత 16 సంవత్సరాలుగా 5000 మంది విద్యార్థులకు ఆర్మూర్ పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలవాలని స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మూర్తి మాట్లాడుతూ పట్వారి తులసి సేవలు అమూల్యమైనవి అని ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోని ముందుకు నడవాలని అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



