- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని ప్రకృతి వనానికి వెళ్లే దారిలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తన దృష్టికి రావడంతో అట్టే స్థలాన్ని గ్రామ కార్యదర్శి బి రాణి బుధవారం పరిశీలించారు. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న వారికి నోటీసులను పంపి, ఇట్టి విషయంపై అధికారులకు నివేదికను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
- Advertisement -


