- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిన తెలిసిందే. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి.
- Advertisement -



