సాహితీకిరణం ఉగాది సంబరాలు
సాహితీకిరణం మాసపత్రిక ఉగాది సంబరాలు ఈ సంవత్సరం ఈ నెల 14న గుంటూరులోని పొత్తూరు సాహితీకిరణం బ్రాంచ్ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తాటికోల పద్మావతి రచించిన ‘కథాపద్మాలు’ కథసంపుటి ఆవిష్కరణ, ఉగాది కవిసమ్మేళనం, ఉగాది పురస్కారాలు, సాహితీకిరణం ఇతర సంస్థల సౌజన్యంతో నిర్వహించిన కథల, కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం ఉంటాయి. ఈ కార్యక్రమానికి డా||జాస్తి వీరాంజనేయులు, తూములూరి రాజేంద్రప్రసాద్, బైసదేవదాసు, డా||పులివర్తి కృష్ణమూర్తి, విడదల సాంబశివరావు, వి.వి.రాఘవరెడ్డి, ఆర్.దమయంతి, డా||జెల్ది విద్యాధరరావు, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి తదితరులు పాల్గొంటారు.
”తెలుగు సాహితీవనం కథా, కవితా పురస్కారం-2026
‘తెలుగు సాహితీవనం కథా, కవితా పురస్కారం 2026’ కొరకు కథలను, కవితలను ఆహ్వానిస్తున్నాం. వర్తమాన పరిస్థితులు, మానవ సంబంధాలు, సాంఘిక ఇతివత్తంతో కథ 1200 పదాలు, కవిత 25 పాదాలకు మించకుండా మార్చి 22 లోపు పంపాలి.
కవితల కొరకు :https://forms.gle/ELM2pE3cf2KynHC X8, కథల కొరకు :https://forms.gle/PoV3vg7B385dvbBT 8. వివరాలకు:9502236670, 8309686404
శాంతికష్ణ, తెలుగు సాహితీవనం


