నవతెలంగాణ – సదాశివ నగర్
హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ వజ్జపల్లి, జడ్పిహెచ్ఎస్ ఉత్నూర్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు కాట్మండి సంతోష్ పాటిల్, సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో కృషి చేస్తేనే విజయ తీరాలను చేరతారని, పదవ తరగతి తర్వాత ఉన్న విద్య ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని భవిష్యత్తులో బాగా చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి తర్వాత ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలను కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్నూర్ సొసైటీ చైర్మన్ ప్రభాకర్ రావు, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమోద్, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ విద్యార్థుల విద్యా విషయాలలో చేసిన కృషిని కొనియాడుతూ వారికి మా యొక్క నిరంతర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజయ్య, చందర్రావు, చంద్ర గౌడ్, నరేష్ గౌడ్, రమేష్ , వీరన్న, ప్రణయ్ లు పాల్గొన్నారు.



