Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకడియం, దానంపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్

కడియం, దానంపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేసి.. తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా మరో ఇద్దరికీ క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -