నవతెలంగాణ – హైదరాబాద్: ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడి నేపథ్యంలో, ఇరాన్ అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. దీనికి ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామని అమెరికాను హెచ్చరించింది. అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీలపై దాడులు తప్పవని తెలిపింది. చమురు కంపెనీల మౌలిక సదుపాయాలను బూడిద కుప్పలుగా మారుస్తామని ప్రకటించింది. ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడిని ధృవీకరించిన ఇరాన్, చమురు మౌలిక సదుపాయాలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ దాడిపై ఇరాన్ సాయుధ దళాల కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో స్పందించారు. తమ చమురు మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికాతో సంబంధం ఉన్న మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు.
ఖర్గ్ ఐలాండ్పై దాడి… అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



