‘వెలుగుమట్ల నామ సంవత్సర – కుమ్మెర కవితా గానం’…
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు దుఃఖ భరిత సన్నివేశాలను నిరసిస్తూ.. బాధితులకు సంఘీభావంగా వచ్చే ఉగాది (19 మార్చి) రోజున పైన పేర్కొన్న అంశం మీద 33 జిల్లాల్లో కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. తరువాత ఈ కవితల్ని పుస్తకంగా తీసుకు వస్తాం.
-గాజోజు నాగభూషణం, రాష్ట్ర కన్వీనర్, బి.సీ.రచయితల సమాఖ్య
‘కడపటి యుద్ధం’
బండి నారాయణస్వామి గారి ‘కడపటి యుద్ధం’ చారిత్రక నవల ఆవిష్కరణ ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఎన్.జి.ఒ.హోమ్, అనంతపురంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్న, భూమన్, అంబటి సురేంద్ర రాజు, లక్ష్మీనరసయ్య, ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. సభ నిర్వహణ: ‘స్పందన’ అనంత కవుల వేదిక. అందరూ ఆహ్వానితులే.
‘బీసీ కులవృత్తుల దీర్ఘకవితలు’పై సదస్సు
బీసీ సాహిత్య వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘బీసీ కులవృత్తుల దీర్ఘకవితలు’పై సదస్సు ఈ నెల 22న ఉదయం 10 గంటలనుండి 5 గంటల వరకు రవింద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ హైదరాబాద్లో నాలుగు సెషన్లుగా జరుగుతుంది. ఇందులో డా|| సంగిశెట్టి శ్రీనివాస్, జూలూరు గౌరీశంకర్, డా|| అమ్మంగి వేణుగోపాల్, డా||నామోజు బాలాచారి, తిరునగరి దేవకీదేవి, కె. ఆనందచారి, తగుళ్లగోపాల్, జంపాల ప్రవీణ్ తదితరులు పాల్గొంటారు. ఇదే సభలో ‘తెగినపోగు, కుంపటి, బువ్వకుండ, మండువ, డాకలి, అసిపె, వంకతాడు, మెట్న, కొలిమి, ముస్తాదు’ పుస్తకాల పరిచయ కార్యక్రమం వుంటుంది.
-బీసీ సాహిత్య వేదిక : కన్వీనర్లు వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్, 9492765358, 9849220321,
జనసాహితి పిలుపు
ఈ నెల 21న స్రామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేక ప్రపంచ కవితాదినంగా పాటించడానికి జనసాహితి పిలుపునిస్తోంది. కవులు ఇప్పటికే యుద్ద బీభత్సంపై అనేక కవితలు రాశారు, రాస్తున్నారు. మానవీయతను, ప్రపంచశాంతిని కోరుకునే మనమందరం ఆరోజు యుద్ధ వ్యతిరేక కవితలను విన్పించుదాం. సమాచారం కోసం డా|| భట్టు లక్ష్మీనారాయణ- 9398834647; దివికుమార్ -78428 74455; ప్రసన్న -94935 52420; ఓవీవీయస్ రామకృష్ణ -92920 01770; పి. మోహనరావు -9440440600. మార్చి 21వ తేదీ సా|| 5:30 గ||లకు జరిగే కవితా పఠన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. డా|| బి. అరుణ, ప్రధాన కార్యదర్శి, జనసాహితి, 70759 57010.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


