- Advertisement -
ఎంఈఓ రాందాస్
పి ఈ టి ఐలయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపిక పోటీలను నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి రాందాస్ పి ఈ టి ఐలయ్య తెలిపారు. సోమవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న మూడవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు అన్నారు. ఇందులో ప్రతి కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి లు ఇమామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



