నవతెలంగాణ – హైదరాబాద్: ఈనెల 22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల మందికి పైగా రైతులకు ఈ నిధులు జమ చేస్తామన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వం హయాంలో రైతులు వరి వేస్తే ఉరి అన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్, యంత్ర పరికరాలు అందిస్తున్నాం. రైతులు, ప్రజల మద్దతుతో మున్సిపల్, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం దక్కింది. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడి తప్పుదోవ పట్టిస్తే ప్రజలు విశ్వసించరు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86లక్షల టన్నుల ధాన్యం పండించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఇందిరమ్మ రాజ్యం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయి’’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.
ఈనెల 22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ: ప్రభుత్వ విప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



