- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ సొసైటీ పరిధిలో ఎఫ్ పి ఓ ఏర్పాట్లపై రైతులు సభ్యులుగా చేరడానికి సొసైటీ కార్యదర్శి గంగాధర్ సొసైటీ సిబ్బంది విట్టల్ మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో రైతులను సభ్యులుగా చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎక్లారాకు చెందిన ప్రదీప్ పటేల్ ను సభ్యులుగా చేర్చుకొని రసీదు అందజేశామని తెలిపారు. అదేవిధంగా కొడిచర తడగూర్ తదితర గ్రామాలలో అధికారులు పర్యటించారు. ఈ గ్రామాలలో కూడా రైతులు అవగాహన కల్పించారు.
- Advertisement -



