నవతెలంగాణ- కుభీర్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలతో అడలెత్తించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, పాఠశాల పరిసరాలను పరిశీలించి ఆ పరిశుభ్రంగా ఉండడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు స్వాతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని శాలను పరిశీలించారు. అక్కడ మెనూ ప్రకారం భోజనము వండకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు.
మెనుకు బదులు అన్నం సాంబారు వండడంతో మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రికి సంబంధించిన పలు హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు, రోగుల వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో మందులు ఇస్తున్నారా లేదా రోగులకు అడిగి తెలుసుకున్నారు.
పంచాయితీ సిబ్బందిపై మండిపడ్డ అదనపు కలెక్టర్..
రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై పంచాయతీ అధికారులపై ఆగ్రం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న నర్సరీ నీ పరిశీలించిన ఆయన విత్తనాలను నాటకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విత్తనాలు నాటి మొక్కలను మన మహోత్సవానికి సిద్ధం ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మండల పంచాయతీ అధికారి భీమేష్ స్థానిక సర్పంచ్ సాయినాథ్ మండల విద్యాధికారి విజయ్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు విజేష్ ఏ పీఓ హరిలాల్, ఐకేపి ఏ పిఎమ్ దత్తాత్రి తదితరులున్నారు.



