నేటితరానికి స్ఫూర్తి ప్రదాత : నరహరి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి (ఏవీఎస్) నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత, త్యాగశీలత నేటి తరం ఉపాధ్యాయులకు స్పూర్తిదాయకమని యూటీఎఫ్ సీనియర్ నాయకులు, సాహితీవేత్త, ఏవీఎస్ సహచరుడు, మోతుకూరి నరహరి అన్నారు. వెంకటస్వామి 25వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరహరి మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి రజతోత్సవాల వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తదుపరి పత్రిక ప్రధాన సంపాదకునిగా చివరి శ్వాస వరకు ఉపాధ్యాయులకు సేవలందించారని తెలిపారు.
ఆన్ డ్యూటీ లేని రోజుల్లో సంఘం కోసం 18 సంవత్సరాల సర్వీసును స్వచ్ఛందంగా వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా మారారని గుర్తుచేశారు. యూటీఎఫ్ను బలమైన సంస్థగా తయారు చేయడంలో వెంకటస్వామి పాత్ర కీలకమని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు సమాన బాధ్యతగా స్వీకరించాలని పదే పదే గుర్తు చేసేవారని తెలిపారు. ఏవీఎస్ స్పూర్తితో నేటి తరం ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తొలుత ఏవీఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్, ఉపాధ్యక్షులు సిహెచ్.దుర్గా భవాని, ఎం.రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ ఉపాధ్యాయ ఉద్యమ నేత అప్పారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



