- Advertisement -
నవతెలంగాణ – రామగిరి : రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధులను పూర్తిగా నివారించేందుకు ఫాగింగ్ మిషన్ ద్వారా భారీ స్థాయిలో మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్ ముందుండి ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతర చర్యలు తీసుకుంటూ, ఆదర్శ నాయకత్వాన్ని చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పందుల సోము, నిమ్మల మమత-సంతోష్, బాద్రపు శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



