నవతెలంగాణ-గోవిందరావుపేట : తేజస్ నవోదయ & సైనిక్ అకాడమీ డైరెక్టర్ తేజస్విని నాగులపల్లి కి 2026 మార్చి 22న “ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్ బిల్డర్ అవార్డు కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన ఉగాది 2026 పురస్కార్ అవార్డు లభించింది. పసర గ్రామానికి చెందిన తేజస్విని
లెర్నింగ్ స్పెషలిస్ట్ మరియు ఇంటర్నేషనల్ వెదిక్ మ్యాథ్స్ ట్రైనర్గా పేరుగాంచి, నవోదయ మరియు సైనిక్ స్కూళ్లలో వరుసగా అత్యధిక సెలక్షన్స్ సాధించడంలో చేసిన విశేష కృషికి ఈ గౌరవం అందుకున్నారు.ఈ అవార్డును ప్రముఖ నటుడు మరియు మాజీ ఎంపీ శ్రీ బాబు మోహన్ అందజేసి, ఆమె నాయకత్వం, కృషి, మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దృక్పథాన్ని ప్రశంసించారు.
ఈ అవార్డు ఆమె పట్టుదల, విద్యపై ఉన్న అభిరుచి మరియు భవిష్యత్ తరాలకు బలమైన పునాది నిర్మించాలనే సంకల్పానికి నిదర్శనం కావాలన్నారు.
మండలంలోని పసర గ్రామానికి చెందిన నాగులపల్లి తేజస్విని పసర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2005-2006 సంవత్సరంలో టెన్త్ క్లాస్ వరకు విద్యను అభ్యసించింది. అంచలంచెలుగా ఎదుగుతూ, తేజస్ నవోదయ అండ్ సైనిక్ అకాడమీ డైరెక్ట్ డైరెక్టర్ నాగులపల్లి తేజస్విని గత వారం రోజుల క్రితం వచ్చిన నవోదయ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 మంది ఉత్తీర్ణులయ్యారూ. అలాగే గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సుమారుగా 12 నుంచి 15 మంది విద్యార్థిని విద్యార్థులు తేజస్ నవోదయ & సైనిక్ అకాడమీ స్కూల్లో విజేతలుగా నిలిచారని, విద్యార్థులను ఉన్నత చదువులకు ఎదిగేలా కృషి చేయడమే తన లక్ష్యమని తేజస్విని అన్నారు. మన మండలం మన జిల్లా నుండి కూడా భవిష్యత్తులో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేయాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. అందుకు గ్రామం నుండి మండలం నుండి జిల్లా నుండి సహాయ సహకారాలు కోరుతున్నానని పేర్కొన్నారు.



