- Advertisement -
– తమ కూతురు వివాహ వేడుకకు హాజరు కావాలని ఆహ్వన పత్రిక అందజేత
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ను (Mallikarjun Kharge) ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వివాహ మహోత్సవానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మల్లికార్జున్ ఖర్గే ను ఆహ్వానించారు. ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన ఖర్గే నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



