నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కత్తల్వాడి గ్రామ సర్పంచ్ గోపాల్ రావు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు వైద్య శిబిరానికి తరలిరావాలని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు, నిర్వహించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు కూడా శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు వైద్య పరీక్షల నిమిత్తం భారీగా తరలివచ్చి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని గ్రామ ఆశ వర్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , వైద్య బృందం, అంగన్వాడీ టీచర్ సంగీతం , ఆశ వర్కర్, జీపీ కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



