Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మారం అవీన్ కు చోటు

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మారం అవీన్ కు చోటు

- Advertisement -

– టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం

– పాల్గొన్న జిల్లా టిఎమ్ఆర్పిఎస్ నాయకులు

నవతెలంగాణ కంఠేశ్వర్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో టూరిజం ప్లాజా హోటల్లో టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా టిఎమ్ఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ కి ప్రోత్సహిస్తూ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ విజ్ఞప్తి మేరకు గత పది సంవత్సరాలుగా జాతి కోసం పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా వాసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మారం అవిన్ ని రాష్ట్ర కమిటీ టిఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ వ్యవస్థాప అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ నియమిక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ సోషల్ మీడియా రాష్ట్ర ఇంచార్జ్ ఇటుక గోపి మాదిగ , నిజామాబాద్ జిల్లా ఎంంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అఖిల్ మాదిగ, టిఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -