- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా మల్యాల గోవర్ధన్ ఎన్నికైయ్యారు. ఈ మేరకు ఆయనకు నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని నూడా చైర్మన్ కేశవ వేణు, కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇర్ఫాన్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ ఈసా ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని మల్యాల గోవర్ధన్ అందుకున్నారు. తమపై నమ్మకం ఉంచి అధికార ప్రతినిధిగా హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -



