నవతెలంగాణ – జుక్కల్ : ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండలంలోని శక్తి నగర్ గ్రామంలో బోరువెల్కు కొత్త మోటారును బిగించి గ్రామ ప్రజలకు నీటి వసతిని కల్పించేందుకు గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ గురువారం నాడు సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో రెండు నెలల క్రితం నుండి రెండు మూడుసార్లు బావి నుండి నీటిని తోడేందుకు బిగించిన మోటారు కాలిపోవడం జరిగిందని నాటినుండి సమస్య పునరావృతం కావడంతో గురువారం నాడు జిపి నిధులతో కొత్త మోటారును ఏర్పాటు చేసి గ్రామస్తులకు నీరా అందించడం జరిగిందని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు నీటికి ఇబ్బంది కలగకుండా సత్వరమే పరిష్కరించి నిరంధించామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ ,జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులకు నీటి సౌకర్యాన్ని కల్పించిన గ్రామ సర్పంచ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



