- Advertisement -
నవతెలంగాణ – తొగుట
అధికారులందరూ సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని కాన్గల్ సొసైటీ చైర్మన్ కుర్మ యాదగిరి అన్నారు. గురువారం తొగుట గ్రామంలోని సర్ కార్యక్రమం భాగంగా ఓటర్ల ఓట్లను సరి చేసిన బీఎల్ఓ లను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తిగా మన గ్రామంలో సేవ చేస్తున్న ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ అధికా రులు, గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ కలసి కట్టుగా గ్రామాన్ని మరింత సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు లచ్చగారి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



