- Advertisement -
నవతెలంగాణ జన్నారం
జన్నారం మండలంలోని ధర్మారం ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు.
8 మంది విద్యార్థులు గురుకుల విద్యాలయాలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్తయ్య తెలిపారు. ఎంపికైన సందీప్,కీర్తన,అవంతిక,తన్మైశ్రీ,హర్షిణి,ఆరుష్,అహల్య,శ్రీజన్ కుమార్ లను పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.
- Advertisement -



