- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో రాష్ట్ర రాజకీయాలు మారుస్తానని జాగృతి చీఫ్కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా శుక్రవారం (మార్చి 27) కవిత నిజామాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి రావాలని.. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఏప్రియల్ 25న కొత్త పార్టీ ప్రకటన రోజు తరలిరావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



