- Advertisement -
– గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ రూ.10 లక్షలతో సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్డు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



